శ్రీలంకలో సోషల్ మీడియాకు మళ్లీ సంకెళ్లు
సోషల్ మీడియాపై శ్రీలంక ప్రభుత్వం మరోసారి తాత్కాలిక బ్యాన్ విధించింది. తాజాగా దేశంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిషేధం విధిస్తున్నట్లు శ్రీలంక సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రదాడుల తరువాత దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నందున సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. ఈ బ్యాన్ను ఏప్రిల్ 30న ఎత్తివేశారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి […]
సోషల్ మీడియాపై శ్రీలంక ప్రభుత్వం మరోసారి తాత్కాలిక బ్యాన్ విధించింది. తాజాగా దేశంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిషేధం విధిస్తున్నట్లు శ్రీలంక సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రదాడుల తరువాత దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నందున సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. ఈ బ్యాన్ను ఏప్రిల్ 30న ఎత్తివేశారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాపై తాత్కాలిక బ్యాన్ విధించడంతో.. పలు మాధ్యమాలకు శ్రీలంక వాసులు మరిన్ని రోజులు దూరం కానున్నారు.