ఎట్టకేలకు శ్రీలంకలో ముగిసిన ఎమర్జెన్సీ
నాలుగు నెలల తర్వాత శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీ ముగిసింది. ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలోని చర్చ్లలో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన అనంతరం.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కొలోంబో నగరంలోని మూడు చర్చ్లు, మూడు హోటళ్లలో ఈస్టర్ పండగ సందర్భంగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 250 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఏప్రిల్ 22వతేదీ నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా టెన్షన్ […]
నాలుగు నెలల తర్వాత శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీ ముగిసింది. ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలోని చర్చ్లలో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన అనంతరం.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కొలోంబో నగరంలోని మూడు చర్చ్లు, మూడు హోటళ్లలో ఈస్టర్ పండగ సందర్భంగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 250 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఏప్రిల్ 22వతేదీ నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. నాలుగు నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ పాలన ముగిసిందని ఆ దేశాధినేత మైత్రిపాల సిరిసేన తెలిపారు. ఈ నెల 22 వ తేదీతో ఎమర్జెన్సీ పాలన ముగిసినట్లు ఆ దేశ అధికారిక ప్రభుత్వ న్యూస్ పోర్టల్లో ట్వీట్ చేశారు.