శర్వానంద్ ‘శ్రీకారం’ లేటెస్ట్ అప్డేట్
ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రారంభమై, హీరోగా మారి టాలీవుడ్లో తనకంటూ సెపరేట్ ఆడియెన్స్కు క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్.
ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రారంభమై, హీరోగా మారి టాలీవుడ్లో తనకంటూ సెపరేట్ ఆడియెన్స్కు క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం ఈ నటుడు నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు. తుది దశకు చేరకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆడిపోయింది. ప్రస్తుతం కేంద్రం నుంచి షూటింగులకు అనుమతులు లభించిన నేపథ్యంలో త్వరలో ఈ మూవీ సెట్స్పైకి తీసుకెళ్లేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
“వ్యవసాయం, రైతుల ప్రాధాన్యత తెలిసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శర్వానంద్ రైతుగా కనిపించబోతున్నారు. ఇంకా 20 రోజుల షూటింగ్ పార్ట్ మిగిలుంది. సెప్టెంబరు ఆఖరి వారం నుంచి తిరిగి చిత్రీకరణ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రస్తుతం పాటల పని కంప్లీట్ అవుతోంది. మిక్కీ జె.మేయర్ మ్యూజిక్ , సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ” అని మూవీ యూనిట్ తెలిపింది.
ఈ మూవీ అనంతరం ఆర్ ఎక్స్ 100 దర్శుకుడ అజయ్ భూపతితో ‘మహా సముద్రం’ సెట్స్పైకి మూవీ చేయబోతున్నాడు శర్వా. కిషోర్ తిరుమల దర్శకత్వంలోనూ ఓ సినిమాకు సైన్ చేశాడు.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!
పబ్జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీలతో రెండు కుటుంబాల ఘర్షణ