పెద్దపల్లి జిల్లాలో వింత.. బొప్పాయి పండులో..!
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వింత సంఘటన చోటుచేసుకుంది. బొప్పాయి పండులో మొలకలు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది....
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వింత సంఘటన చోటుచేసుకుంది. బొప్పాయి పండులో మొలకలు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. పండులో గింజలతో పాటు మూడు మొలకలు కనిపించడంతో ఇది చూసేందుకు జనం ఆసక్తి చూపించారు. స్వప్నకాలనీలో లిఖిత, సత్యనారాయణ దంపతులు నివాసముంటున్నారు. ఇంట్లోని బొప్పాయి చెట్టుపై ఉన్న పండును తెంచారు. పిల్లలకు కోసి ఇవ్వబోగా అందులో సుమారు రెండు, మూడు ఇంచుల మొక్కలు కనిపించాయని లిఖత తెలిపారు. ఇది ఆ నోట ఈ నోట విన్న జనం ఆ బొప్పాయి పండును చూసేందుకు క్యూ కట్టారు.