అజర్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారిస్తూనే జట్టుకు కూడా చిరస్మరణీయ విజయాలన్నందిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. […]
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారిస్తూనే జట్టుకు కూడా చిరస్మరణీయ విజయాలన్నందిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. రాంచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలడంతో.. భారత్కు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో సౌతాఫ్రికాని టీమ్ఇండియా ఫాలోఆన్ ఆడిస్తోంది. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విరాట్ 8సార్లు ఫాలోఆన్ ఆడించాడు. అజారుద్దీన్(7), మహేంద్ర సింగ్ ధోనీ(5), సౌరభ్ గంగూలీ(4) ఫాలోఆన్ ఆడించిన జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పుణె టెస్టులోనూ డుప్లెసిస్సేన ఫాలోఆన్ ఆడి ఓడిపోయింది.