Rohith Sharma : రోహిత్ శర్మ..! ఇది నీకు తగునా… సోషల్ మీడియాలో మండిపడుతున్న అభిమానులు
బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్శర్మ సహా నలుగురు క్రికెటర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు.
Rohit Sharma : బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్శర్మ సహా నలుగురు క్రికెటర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు. వారు చెల్లించిన బిల్లు ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఐదుగురి క్రికెటర్లు బీఫ్, పంది మాంసం తిన్నారని సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి ఈ కష్టాలను తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా ఈ ఐదుగురు క్రికెటర్లు ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్మన్ గిల్, పృథ్వీ షా, వికెట్కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది.
సంవత్సరం సందర్భంగా మెల్బోర్న్లోని సమీప రెస్టారెంట్కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా… అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇదే ఇప్పుడు వారికి పెద్ద సమస్యగా మారింది.
ఇది తెలుసుకున్న రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఆ ట్వీట్లో క్రికెటర్ల ఆహారానికి చెల్లించిన బిల్ను కూడా జతచేశాడు. అయితే భారత ఆటగాళ్లు ఆ బిల్లో పంది, బీఫ్ మాంసం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.