ఇప్పటికైనా ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటా: సింధు హెచ్చరిక
అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.
PV Sindhu on rumors: అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఆమె ట్వీట్ చేశారు. అయితే పీవీ సింధుకు ఇంతలా కోపం రావడానికి ఓ కారణం ఉంది.
ప్రస్తుతం పీవీ సింధు లండన్లో ఉంటుండగా.. తల్లిదండ్రులు, కోచ్ గోపిచంద్తో గొడవ పడి సింధు అక్కడకు వెళ్లిందని కొన్ని వార్తలు వచ్చాయి. అంతేకాదు వ్యక్తిగత కారణాల వలన ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నట్లు ఓ జాతీయ పత్రికలో వెల్లడించారు. దీంతో వాటిపై ఒలింపిక్ పతక విజేత స్పందించారు. ”గటొరేడ్ స్పోర్స్ సైన్స్ ఇనిస్టిట్యూట్లో నా న్యూట్రిషన్ పని మీద కొద్ది రోజుల క్రితం నేను లండన్కి వచ్చాను. మా తల్లిదండ్రులకే తెలిసే నేను ఇక్కడకు వచ్చా. నాకు, మా ఫ్యామిలీతో ఎలాంటి విబేధాలు లేవు. అయినా నా కెరీర్ కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన నా తల్లిదండ్రులతో నాకు ఇబ్బందులు ఎందుకు ఉంటాయి.? నేను ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటా. వాళ్లు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. మా ఇంట్లో వారితో నేను రోజు మాట్లాడుతా. అలాగే అకడమీలో ట్రైనింగ్ ఫెసిలిటీ గురించి నా కోచ్ గోపిచంద్తో నాకు ఎలాంటి విబేధాలు లేవు” అని స్పష్టం చేశారు. ఇక ఈ వార్త రాసిన రిపోర్టర్ ముందుగా నిజాలు తెలుసుకొని ఏదైనా రాయాలని, ఇప్పటికైనా ఆపకపోతే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని సింధు హెచ్చరించారు.
Read More:
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్కి కరోనా పాజిటివ్
కాజల్ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్ యంగ్ హీరో..!
I came to London a few days back to work on my nutrtion and recovery needs with GSSI. Infact I have come here with the consent of my parents and absolutely they were no family rifts in this regard. pic.twitter.com/zQb81XnP88
— Pvsindhu (@Pvsindhu1) October 20, 2020