చిక్కుల్లో పడ్డ పృథ్వీ షా.. మళ్ళీ వేటు తప్పదా.?
డోపింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యి 8 నెలలు నిషేదానికి గురైన యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. బ్యాన్ పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్కు అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్రస్తుతం ముంబై తరపున రంజీ మ్యాచులు ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుత ప్రదర్శనను కనబరిచిన పృథ్వీ షా.. అదే ఫామ్ను రంజీల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. హోటల్ సిబ్బందితో గొడవ… రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడిన షా […]
డోపింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యి 8 నెలలు నిషేదానికి గురైన యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. బ్యాన్ పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్కు అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్రస్తుతం ముంబై తరపున రంజీ మ్యాచులు ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుత ప్రదర్శనను కనబరిచిన పృథ్వీ షా.. అదే ఫామ్ను రంజీల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు.
హోటల్ సిబ్బందితో గొడవ…
రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడిన షా మొదటి మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇన్నింగ్స్లో 66 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్లో 202(179) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సీజన్లో ముంబై తన రెండో మ్యాచ్కు సిద్దమవుతున్న తరుణంలో.. పృథ్వీ షా తనకు తానుగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు.
అందుతున్న సమాచారం బట్టి పృథ్వీ షా, సహా ఆటగాడు ఏక్నాధ్ కెర్కర్లపై జట్టు యాజమాన్యం క్రమశిక్షణా చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇద్దరూ కూడా హోటల్ సిబ్బందితో తీవ్రమైన గొడవకు దిగారని సమాచారం. ఈ గొడవలో సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయని వినికిడి. ఈ ఇద్దరి ఆటగాళ్లతో పాటుగా కోచ్ వినాయక్ సామంత్పై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కోచ్ సామంత్ టీమ్ మేనేజ్మెంట్ విషయంలో ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని జట్టు యాజమాన్యాన్ని కోరింది. ముంబై తన రెండో మ్యాచ్ డిసెంబర్ 25న రైల్వేస్తో ఆడనుంది. ఈ మ్యాచ్లోపు గోడపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంసీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏది ఏమైనా పృథ్వీ షాపై రెండు మ్యాచుల వేటు పడే అవకాశం కనిపిస్తోంది.