Andhra Pradesh: సీఎం జగన్ను కలిసిన స్టార్ షట్లర్ శ్రీకాంత్.. బహుమతిగా 7 లక్షల నగదు, 5 ఎకరాల స్థలం అందజేత..
Andhra Pradesh: మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ను ఘనంగా సన్మానించారు
Andhra Pradesh: మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ను ఘనంగా సన్మానించారు సీఎం వైఎస్ జగన్. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్గా సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్ను ప్రత్యేకంగా అభినందించారు. కాగా, ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19వ తేదీ వరకు స్పెయిన్లో జరిగిన 2021 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించాడు శ్రీకాంత్. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ ఇవాళ ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా కిడాంబి శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్ కృష్ణ పాల్గొన్నారు.
Also read:
దక్షిణ భారత ప్రదేశాలు: శీతాకాలపు సెలవులను ఈ దక్షిణ భారత ప్రదేశాలలో గడపండి
Senapathi Trailer: సేనాపతితో జాగ్రత్తగా ఉండాలి.. ఉత్కంఠంగా ట్రైలర్..