కరోనా కలిపింది ఆ ఇద్దరినీ.. లైవ్‌లో ‌దిగ్గజ ఆటగాళ్ల సరదా సంభాషణ..!

టెన్నిస్‌లో ఆ ఇద్దరు ప్రపంచ లెజండ్లు. కానీ ఆటలో వారిద్దరి మధ్య 15 సంవత్సరాలుగా శత్రుత్వం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరిని కరోనా  కలిపింది.

కరోనా కలిపింది ఆ ఇద్దరినీ.. లైవ్‌లో ‌దిగ్గజ ఆటగాళ్ల సరదా సంభాషణ..!
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 1:36 PM

టెన్నిస్‌లో ఆ ఇద్దరు ప్రపంచ లెజండ్లు. కానీ ఆటలో వారిద్దరి మధ్య 15 సంవత్సరాలుగా శత్రుత్వం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరిని కరోనా  కలిపింది. ఇంతకు ఆ ఇద్దరు ఎవరంటే.. రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన నాదల్.. ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు ఆండీ ముర్రీతో ఇటీవల ఇన్‌స్టాలో లైవ్‌ ఇచ్చారు. ఇలా లైవ్ ఇవ్వడం నాదల్‌కు తొలిసారి కాగా.. పలువురి అభిమానులను ఆయనను ప్రశ్నలను సంధించారు. ఈ క్రమంలో ఫెదరర్ కూడా ఆ చాట్‌లో జాయిన్‌ అయ్యి.. నాదల్‌కు కొన్ని ప్రశ్నలు వేశారు. ఇలా ఫెదరర్, నాదల్ మధ్య కాసేపు సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో వీరిద్దరి కాసేపు జోక్‌లు కూడా వేసుకున్నారు. అంతేకాదు క్వారంటైన్ సమయంలో ఏమీ చేస్తున్నావంటూ ప్రశ్నించుకున్నారు. ఏదేమైనా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను చూసిన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read This Story Also: ఖననాల కోసం స్థలం ఇస్తానన్న స్టార్ హీరో.. పవన్ ప్రశంసలు..!