India Vs Australia 2020: 1988 తర్వాత తొలిసారి.. ఆసీస్ గడ్డపై దమ్ము చూపిన టీమిండియా.. కంగారూలకు పరాభవం..
India Vs Australia 2020: ఆసీస్ గడ్డపై టీమిండియా దమ్ము చూపించింది. 1988 తర్వాత బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఓటమెరుగని కంగారూలకు...
India Vs Australia 2020: ఆసీస్ గడ్డపై టీమిండియా దమ్ము చూపించింది. 1988 తర్వాత బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఓటమెరుగని కంగారూలకు తొలిసారి ఓటమిని టీమిండియా రుచి చూపించింది. ఫలితంగా ఆఖరి టెస్టులో రహనేసేన విజయం సాధించడమే కాకుండా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అంతేకాకుండా టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి గెలుపొందింది. ఇదే వేదికగా ఆస్ట్రేలియా సరిగ్గా 33 ఏళ్ల క్రితం ఓడిపోగా.. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.
కాగా, ఐదో రోజు 328 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను.. గిల్(91), పంత్(89), పుజారా(56)లు అద్భుతమైన ఇన్నింగ్స్తో గెలుపు తీరాలకు చేర్చారు. గబ్బాలో మూడో అత్యధిక లక్ష్య చేధన ఇదే కావడం విశేషం. దీని కంటే ముందు విండీస్తో జరిగిన మ్యాచ్లో 406, ఇంగ్లాండ్తో 387 పరుగుల లక్ష్య చేధనలు ఉన్నాయి.
ఇవి చదవండి:
స్టీవ్ స్మిత్ను ఆట ఆడుకున్న రోహిత్ శర్మ.. సేమ్ సీన్ రిపీట్.. హిట్మ్యాన్ కామెడీ అదుర్స్…
అరుదైన రికార్డు సాధించిన హైదరాబాదీ.. సిరాజ్కు సలాం కొడుతోన్న నెటిజన్లు..