టీంకు ఎలాంటి ఇబ్బంది లేదు.. గువాహటి సేఫ్టీ సిటీ..!

శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. ఆదివారం అసోం రాజధాని గువాహటి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవన్న వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మీడియా ప్రశ్నించింది. దీంతో కోహ్లీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఏఏ నిరసనల నేపథ్యంలో […]

టీంకు ఎలాంటి ఇబ్బంది లేదు.. గువాహటి సేఫ్టీ సిటీ..!
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 2:04 AM

శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. ఆదివారం అసోం రాజధాని గువాహటి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవన్న వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మీడియా ప్రశ్నించింది. దీంతో కోహ్లీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఏఏ నిరసనల నేపథ్యంలో జట్టుకు..ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని పేర్కొన్నాడు. భద్రతా పరంగా అంత ముప్పేమి ఉండదని.. గువాహటిని సేఫ్టీసిటీగా భావిస్తున్నామన్నాడు.

ఇక దేశ వ్యాప్తంగా చెలరేగుతున్న ఈ ఆందోళనలపై తాను బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించదలుచుకోలేదన్నాడు. ఇరు వైపులా అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుందని.. ఈ అంశంపై నాకు పూర్తి సమాచారం తెలీదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్డిగా నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదని పేర్కొన్నాడు.

కాగా, అసోంలో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకు మూడు వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. నిరసనల నేపథ్యంలో హింసకు పాల్పడ్డ మరో 190 మందిని అరెస్ట్ చేశారు. ఇక మ్యాచ్ జరుగనున్న గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో.. అసోం క్రికెట్‌ అసోసియేషన్‌ భద్రతను కట్టుదిట్టం చేసింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు కేవలం మొబైల్‌ ఫోన్లు, పర్సులు మాత్రమే తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు