గంభీర్పై ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం
హైదరాబాద్ః టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్పై మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీని కాకుండా సంజూ శాంసన్ను ది బెస్ట్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ అనడంపై ఫైరవుతున్నారు. సంజూ శాంసన్పై గంభీర్ ఒక ట్వీట్ చేశాడు. నేను సాధారణంగా క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడను. కానీ సంజూ శాంసన్ నైపుణ్యాలు చూశాక ప్రస్తుతం భారత్లో అతనే ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని సంతోషంగా చెబుతున్నాను. ప్రపంచకప్లో నెం.4 స్థానంలో […]
హైదరాబాద్ః టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్పై మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీని కాకుండా సంజూ శాంసన్ను ది బెస్ట్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ అనడంపై ఫైరవుతున్నారు.
సంజూ శాంసన్పై గంభీర్ ఒక ట్వీట్ చేశాడు. నేను సాధారణంగా క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడను. కానీ సంజూ శాంసన్ నైపుణ్యాలు చూశాక ప్రస్తుతం భారత్లో అతనే ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని సంతోషంగా చెబుతున్నాను. ప్రపంచకప్లో నెం.4 స్థానంలో అతడు బ్యాటింగ్ చేయాలని నేను భావిస్తున్నాను అని గంభీర్ ట్వీట్ చేశాడు.
దీని మూలంగానే గంభీర్పై ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ అందరినీ ఆకట్టుకున్నాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో అతడు 102 పరుగులు చేసి, అందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు.