వెస్టిండీస్ మాజీ కెప్టెన్కు పాక్ పౌరసత్వం..
వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ఆల్రౌండర్ డారెన్ సామికి పాకిస్థాన్ పౌరసత్వం దక్కబోతుంది. పాకిస్తాన్లో మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్కు పూర్వ వైభవం తేవడానికి విశేషమైన కృషి చేసినందుకు సామికి పౌరసత్వం అందజేస్తామని పిసిబి మీడియా విభాగం ఒక ట్వీట్లో ప్రకటించింది.
వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ఆల్రౌండర్ డారెన్ సామికి పాకిస్థాన్ పౌరసత్వం దక్కబోతుంది. పాకిస్తాన్లో మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్కు పూర్వ వైభవం తేవడానికి విశేషమైన కృషి చేసినందుకు సామికి పౌరసత్వం అందజేస్తామని పిసిబి మీడియా విభాగం ఒక ట్వీట్లో ప్రకటించింది. పాకిస్తాన్ అత్యున్నత సివిల్ అవార్డు ‘నిషాన్ ఈహైదర్ ’తో పాటు, ఆ దేశ గౌరవ పౌరసత్వంను సామీకి..పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి మార్చి 23 న ఇవ్వనున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) శనివారం తెలిపింది. కాగా ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్లో డారెన్ సామి పెషావర్ జెల్మి జట్టుకు సారథిగా వ్యవహిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు, భద్రతా దృష్ట్యా పాక్లో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ క్రికెటర్లు వెనుకాడుతోన్న వేళ..సామి ముందుకొచ్చి 2017లో పీసిఎల్ ఫైనల్ ఆడాడు.
దీంతో సామి చేసిన సాయానికి కృతజ్ఞతగా దేశ గౌరవ పౌరసత్వం ఇవ్వాలని పెషావర్ జెల్మి జట్టు ఆ దేశ అధక్షుడిని కోరింది. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా వేరే దేశ పౌరసత్వం తీసుకున్న మూడో క్రికెటర్గా సామి రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. గతంతో మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), హెర్షల్ గిబ్స్ (సౌతాఫ్రికా)లకు సెయింట్ కిట్స్ ప్రభుత్వం సిటిజన్ షిప్ ఇచ్చింది.
President of Pakistan Dr @ArifAlvi will confer the highest civilian award and honourary citizenship to Darren Sammy on 23 March for his invaluable contribution to cricket in Pakistan. pic.twitter.com/mn9AiLknB0
— PCB Media (@TheRealPCBMedia) February 22, 2020
.