ఐపీఎల్ ఫైనల్కు హోస్టులుగా బాలీవుడ్ జంట
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. నేడు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ టైటిల్ కోసం హోరాహోరీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ఆదివారం క్రికెట్ ప్రపంచం దృష్టి హైదరాబాద్వైపే ఉంది. దీనికి తోడు ఫైనల్ మ్యాచ్కు బాలీవుడ్ మసాలా తోడవనుంది. బాలీవుడ్ జంట సల్మాన్ఖాన్, కత్రినా […]
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. నేడు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ టైటిల్ కోసం హోరాహోరీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ఆదివారం క్రికెట్ ప్రపంచం దృష్టి హైదరాబాద్వైపే ఉంది. దీనికి తోడు ఫైనల్ మ్యాచ్కు బాలీవుడ్ మసాలా తోడవనుంది. బాలీవుడ్ జంట సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్ ఈ మ్యాచ్లో హోస్టులుగా వ్యవహరించనున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘భారత్’ జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రచారం చేసుకునేందుకు వాళ్లు టీవీ స్టూడియోలో కనిపించనున్నట్లు సమాచారం. మ్యాచ్కు ముందు నిర్వహించే కార్యక్రమంలో వాళ్లిద్దరూ పాల్గొననున్నారు.