IND vs BAN Kanpur Weather Forecast: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు మ్యాచ్ ఈరోజు కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకాగా, 9 గంటలకు టాస్ వేయనున్నారు. అయితే, ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే కాన్పూర్లో వర్షం కురుస్తోంది. కాబట్టి, టాస్ ఆలస్యమవుతుంది. వర్షం కారణంగా మైదానంలో కవర్లు వేయబడ్డాయి. ఇప్పుడు వర్షం ఆగిపోయినప్పటికీ, ఇంకా వాటిని తొలగించలేదు.
దాదాపు 1000 రోజుల తర్వాత కాన్పూర్లో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టీం ఇండియా చివరిగా 2021లో గ్రీన్ పార్క్ స్టేడియంలో న్యూజిలాండ్తో చివరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత ఆ జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్కు ఒకరోజు ముందు వర్షం కారణంగా ఆటగాళ్లు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో ఆట ఆలస్యం కానుంది.
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తొలిరోజు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. రోజంతా దట్టమైన మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. అందుకే, మ్యాచ్ జరిగే అవకాశం తక్కువ. ముఖ్యంగా తొలి సెషన్ తర్వాత 50 నుంచి 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ రెండో రోజు కూడా మెరుపులు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, ఆట మూడవ రోజు అంటే ఆదివారం ఉదయం వర్షం కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజంతా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. కానీ, మ్యాచ్ జరిగే నాలుగు, ఐదో రోజు వాతావరణం స్పష్టంగా ఉంటుందని, మ్యాచ్కు ఎలాంటి అంతరాయం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది.
రెండో టెస్టుకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..