కోహ్లీని టార్గెట్ చేసిన హిట్ మ్యాన్!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో చాలాకాలం నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇవాళ విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్లో విరాట్ కోహ్లీ 891 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ శర్మ 885 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి మధ్య కేవలం 6 పాయింట్లు మాత్రమే డిఫరెన్స్… రోహిత్ శర్మ సెమీస్లో గానీ ఫైనల్లో గానీ మరో భారీ ఇన్నింగ్స్ ఆడితే టాప్ ప్లేస్ చేరుకోవడం […]
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో చాలాకాలం నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇవాళ విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్లో విరాట్ కోహ్లీ 891 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ శర్మ 885 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి మధ్య కేవలం 6 పాయింట్లు మాత్రమే డిఫరెన్స్… రోహిత్ శర్మ సెమీస్లో గానీ ఫైనల్లో గానీ మరో భారీ ఇన్నింగ్స్ ఆడితే టాప్ ప్లేస్ చేరుకోవడం ఖాయం. ఇక బౌలర్ల ర్యాంకింగ్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఇప్పటికే ఐదు సెంచరీలు చేసి.. టోర్నీలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన రోహిత్.. ఐదు సెంచరీలతో పాటు ఒక అర్ధ సెంచరీ నమోదు చేసి 647 పరుగులు చేసింది.
ఐసీసీ టాప్ 5 బ్యాట్స్మెన్లు వీరే..
- విరాట్ కోహ్లి (891)
- రోహిత్ శర్మ (885)
- బర్ అజామ్ (827)
- డుప్లెసిస్ (820)
- రాస్ టేలర్ (813)
ఐసీసీ టాప్ 5 బౌలర్లు వీరే..
- జస్ప్రీత్ బుమ్రా (814)
- ట్రెంట్ బౌల్ట్ (758)
- పాట్ కమిన్స్ (698)
- కగిసో రబాడ (694)
- ఇమ్రాన్ తాహిర్ (683)
.