PV.Sindhu: పొరపాటుకు చింతిస్తున్నాం.. మమ్మల్ని క్షమించు.. పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన బీఏటీసీ
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు రిఫరీ పొరపాటు కారణంగా ఓడిపోయింది. ఈ అంశాన్ని అతని దృష్టికి తీసుకెళ్లినా అతను పట్టించుకోలేదు. కాగా ఈ వివాదంపై బ్యాడ్మింటన్...
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు రిఫరీ పొరపాటు కారణంగా ఓడిపోయింది. ఈ అంశాన్ని అతని దృష్టికి తీసుకెళ్లినా అతను పట్టించుకోలేదు. కాగా ఈ వివాదంపై బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్ క్షమాపణలు చెప్పారు. ఆ రోజు రిఫరీ పొరపాటుగా వ్యవహరించారన్నారు. మానవ తప్పిదానికి సింధూకు క్షమాపణలు కోరారు. మున్ముందు ఇలాంటి పొరబాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు జరిగిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దలేం. కాబట్టి మమ్మల్ని క్షమించండి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని మాత్రం స్పష్టం చేశారు. కాగా.. ఈ మ్యాచ్ లో సింధు అకానె యమగూచి చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Nice umpiring! #BAC2022 pic.twitter.com/3EgLS4kW7n
— Sammy (@Sammy58328) April 30, 2022
తొలి గేమ్ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్లో 14-11తో ఆధిపత్యంలో ఉన్న సమయంలో మ్యాచ్ రిఫరీ యమగూచికి ఒక పాయింట్ కేటాయించారు. సింధూ సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనవసరంగా ఒక పాయింట్ కోల్పోవడంతో స్కోరు 14-12గా మారింది. ఈ విషయంపై చీఫ్ రిఫరీకి కూడా ఫిర్యాదు చేసింది పీవీ సింధు. అయినా సరైన స్పందన రాకపోవడంతో ఆసియా బ్మాడ్మింటన్ ఫెడరేషన్కు ఫిర్యాదు చేసింది.