నెక్ట్స్ ఐపీఎల్లో ధోని ఉంటాడట!..ఫ్యాన్స్కు పండగేనా?
భారత సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలకబోతున్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటీపై మహీ మాత్రం స్పందించలేదు. బీసీసీఐ కూడా ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ మహీ రిటైర్మెంట్ ప్రకటించినా..అవి వన్డేలకు మాత్రమేనా? ఐపీఎల్ కూాడానా అనే చర్చ విసృతంగా జరుగుతోంది. అయితే వీటిపై ఒక క్లారిటీ మాత్రం వచ్చేసింది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికినా.. ఐపీఎల్లో మాత్రం […]
భారత సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలకబోతున్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటీపై మహీ మాత్రం స్పందించలేదు. బీసీసీఐ కూడా ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఒకవేళ మహీ రిటైర్మెంట్ ప్రకటించినా..అవి వన్డేలకు మాత్రమేనా? ఐపీఎల్ కూాడానా అనే చర్చ విసృతంగా జరుగుతోంది. అయితే వీటిపై ఒక క్లారిటీ మాత్రం వచ్చేసింది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికినా.. ఐపీఎల్లో మాత్రం 2020 సీజన్లో ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ అధికార ప్రతినిధి మీడియాకు ఉప్పందించారు. దీంతో ‘తలా’ ఫ్యాన్స్ హ్యపీ ఫీలవుతున్నారు.
వాస్తవానికి మహీని కావాలనే రిటైర్మెంట్కు పురిగొల్పుతున్నారనేది కొంతమంది క్రీడా ఎనలిస్ట్ల వాదన. టీం కెప్టెన్గా పలు మెగా ట్రోఫీలను అందించి..ఏనాడు సొంత రికార్డుల కోసం ఆలోచించని ఆటగాడిపై ఇటువంటి విధానం తగదని క్రికెట్ గాడ్ సచిన్ కూడా అభిప్రాయపడ్డాడు. అంతేకాదు పలువురు విదేశీ క్రికెటర్లు సైతం ధోని ఇంకా భారత్ సేవలందించగలడని చెప్తున్నారు. అసలు ధోని మనసులో ఏముందో చూడాలి.