లాక్‌డౌన్ 4.0: క్రీడాకారులకు భారీ ఊరట.. మరి ఐపీఎల్ సంగతేంటి.!

దేశంలో కరోనా వైరస్ తీవ్రత విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను ఈ నెలాఖరు దాకా పొడిగించింది. దీనితో పాటుగా ప్రజలకు వెసులుబాటు కల్పించేలా పలు సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో క్రీడాకారులకు భారీ ఊరట లభించింది. రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. ఇకపై చక్కగా మైదానాల్లో ప్రాక్టీసు మొదలుపెట్టవచ్చు. లాక్ డౌన్ 4.0లో స్టేడియంలు, క్రీడా సముదాయాలను తెరుచుకోవచ్చునని.. కానీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని కేంద్ర హోం […]

లాక్‌డౌన్ 4.0: క్రీడాకారులకు భారీ ఊరట.. మరి ఐపీఎల్ సంగతేంటి.!
Follow us

|

Updated on: May 18, 2020 | 7:57 PM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను ఈ నెలాఖరు దాకా పొడిగించింది. దీనితో పాటుగా ప్రజలకు వెసులుబాటు కల్పించేలా పలు సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో క్రీడాకారులకు భారీ ఊరట లభించింది. రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. ఇకపై చక్కగా మైదానాల్లో ప్రాక్టీసు మొదలుపెట్టవచ్చు.

లాక్ డౌన్ 4.0లో స్టేడియంలు, క్రీడా సముదాయాలను తెరుచుకోవచ్చునని.. కానీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనితో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారికి ఇది పెద్ద ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. త్వరలోనే దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ శిక్షణా శిబరాలన్నీ తెరుచుకోనుండగా.. ప్రభుత్వం నుంచి మరిన్ని మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే క్రీడా సముదాయాలా లేక శిక్షణ కేంద్రాలను మాత్రమే తెరవాలా అనే విషయంపై క్లారిటీ వస్తుందని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపాడు.

మరోవైపు ప్రేక్షకులు లేకుండా స్టేడియంలు తెరుచుకునేందుకు కేంద్రం ఛాన్స్ ఇవ్వడంతో.. వాయిదా పడిన ఐపీఎల్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో బీసీసీఐ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా, ఇప్పటికే బోర్డు అభిమానులు లేకుండా అతి కొద్ది స్టేడియంలలో తక్కువ మ్యాచులతో ఐపీఎల్ 13ను నిర్వహించాలని గతంలోనే ఆలోచించింది. దానికి తగ్గట్టు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది.

Read More:

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..

Breaking: ఏపీలో బస్సు సర్వీసులకు అనుమతి..

ఏపీ: ‘రైతు భరోసా’ డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోండిలా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..