Tirupati Laddu: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మరో కీలక నిర్ణయం..!

|

Sep 25, 2024 | 6:37 PM

హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం. అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే అయ్యింది.

Tirupati Laddu: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మరో కీలక నిర్ణయం..!
Tirupati Laddu
Follow us on

హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం. అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే అయ్యింది. ఇది కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం. అందుకే ఇప్పుడు ప్రాయశ్చిత్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్‌పై టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జనరల్ మేనేజర్ పీ. మురళీకృష్ణ, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇంతకుముందు, కల్తీ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసు అధికారి ఉత్తమ్ త్రిపాఠి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో, ఒక రోజు ముందు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. తిరుమల దేవస్థానం ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాలుగు నమూనాలలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు సెంట్రల్ లైసెన్స్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదని అడుగుతూ AR డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు FSSAI నోటీసు జారీ చేసింది. కేంద్ర ప్రయోగశాలలో నెయ్యి నమూనాల విశ్లేషణలో ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలిందని రెగ్యులేటర్ తెలిపారు. TTD నెయ్యి సేకరణ కమిటీ సరఫరా చేసిన అన్ని నమూనాలను పరీక్ష కోసం గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న NDDB కాఫ్ ల్యాబ్‌కు పంపారు. నెయ్యి ప్రమాణాలకు అనుగుణంగా లేదని FSSAI గుర్తించింది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడేవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఆరోపించారు. ఈ వాదనలను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇదిలాఉండగా ఆదివారం(సెప్టెంబర్ 22) ఆలయాన్ని, ప్రసాదాలను శుద్ధి చేసిన అర్చకులు, శాంతి హోమం నిర్వహించారు. లడ్డూ ప్రసాదం పవిత్రతను పునరుద్ధరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కొసం ఇక్కడ క్లిక్ చేయండి..