కరోనా నేపథ్యంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు.. మరికొంతకాలం పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి భారత రైల్వే శాఖ ప్రత్యేక ట్రయిన్స్ నడుపుతోంది. లాక్ డౌన్ సమయంలో వివిద ప్రాంతాల్లో చిక్కుపోయిన వారిని వారివారి గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది రైల్వే శాఖ.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి భారత రైల్వే శాఖ ప్రత్యేక ట్రయిన్స్ నడుపుతోంది. లాక్ డౌన్ సమయంలో వివిద ప్రాంతాల్లో చిక్కుపోయిన వారిని వారివారి గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది రైల్వే శాఖ. అయితే, గత కొద్దిరోజులుగా ప్రత్యేక రైళ్లు నిలిచిపోయతాయన్న వార్తలను ఇది వరకే ఖండించిన అధికారులు.. మరి కొన్నిరోజులపాటు స్పెషల్ ట్రైన్లను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా నడిపిస్తున్న రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో సికింద్రాబాద్-హావ్డా-సికింద్రాబాద్ (నం.02702/02705), విజయవాడ-ఎంజీఆర్ చెన్నైసెంట్రల్-విజయవాడ (నం.02711/02712), విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ(నం.02718/02717), సికింద్రాబాద్-శాలిమార్-సికింద్రాబాద్ (నం.02774/02773) రైళ్లు యథావిధిగా నడుస్తాయని పేర్కొంది. అయితే, డిసెంబరు 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ సమయంలో మార్పు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ప్రస్తుతం భారతీయ రైల్వే కేవలం ప్రత్యేక కోవిడ్ రైళ్లను మాత్రమే నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1 నుంచి ఆ రైళ్లను కూడా నిలిపివేస్తుందని, దీంతో మొత్తం అసలు రైళ్లే నడవవని ఒక వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం కూడా అయ్యింది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజంలేదని గతంలోనే అధికారులు క్లారిటీ ఇచ్చారు.