ఎస్‌పీబీ కోలుకోవాలంటూ శ్రీశైలంలో పూజలు

ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు శ్రీస్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆదేశాల మేరకు..

ఎస్‌పీబీ కోలుకోవాలంటూ శ్రీశైలంలో పూజలు
Follow us

|

Updated on: Sep 06, 2020 | 11:36 PM

ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు శ్రీస్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆదేశాల మేరకు శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక జపహోమ పూజాధికాలు, అభిషేక, కుంకుమార్చనలు జరిపిస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీశైలం శారదాపీఠం నిర్వాహకులు వెల్లడించారు.

కోవిడ్ మహమ్మారి సోకి గత కొంతకాలంగా చెన్నైలోని దవాఖానలో బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకుని తన గాత్రాన్ని అందరికి వినిపించాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీశైలం శారదాపీఠం నిర్వాహకులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ ప్రత్యేక పూజలు జరుపుతున్నామని చెప్పారు.