యూపీలో మహిళలకిక పటిష్ట భద్రత, సీఎం యోగి ఆదిత్యనాథ్
రానున్న దసరా ఫెస్టివల్ ను పురస్కరించుకుని తమ రాష్ట్రంలో మహిళలకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారికి రక్షణ, భద్రత కల్పించడమే తమ ధ్యేయమన్నారు
రానున్న దసరా ఫెస్టివల్ ను పురస్కరించుకుని తమ రాష్ట్రంలో మహిళలకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారికి రక్షణ, భద్రత కల్పించడమే తమ ధ్యేయమన్నారు. ఈ నెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళల రక్షణకు సంబంధించి ప్రత్యేక ప్రచారకార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పండుగ వేళల్లో రాష్ట్రంలో మహిళలను వేధించే ఆకతాయిలు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల పోలీసు బలగాలను పెంచుతామని ఆయన చెప్పారు. ఇప్పటికే హత్రాస్ ఘటన నేపథ్యంలో యోగి ప్రభుత్వం మహిళల సెక్యూరిటీకి కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.