ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేటెస్ట్ హెల్త్ అప్డేట్
అనారోగ్య కారణాలతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు.
అనారోగ్య కారణాలతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. శుక్రవారం నుంచి ఆయన ఆహారం తీసుకుంటున్నారని, రోజులో 15-20 నిమిషాలు డాక్టర్ల సాయంతో లేచి కూర్చొంటున్నారని వివరించారు. ఈ మేరకు ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ప్రత్యేక వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఇంకా ఎస్పీబీకు ఎక్మో, వెంటిలేటర్ సాయంతో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని. ఎలాంటి ఇతర ఇన్ఫెక్షన్లూ లేవని చరణ్ పేర్కొన్నారు. అయితే, ఆయన ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిదని పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన వారిందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు ఎస్పీ చరణ్.
View this post on Instagram
Also Read :
ఏపీలో కల్తీ కూల్ డ్రింక్లు.. తస్మాత్ జాగ్రత్త !