కోద్దిగా కోలుకున్నారు…
కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్ను...
కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్ను విడుదల చేశాయి. చికిత్సకు బాలు బాగా స్పందిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
బాలు స్పృహలోకి వచ్చారని, ఆయన శ్వాస ప్రక్రియ బాగా మెరుగైందని వెల్లడించారు. ఇలాగే నిలకడగా ఉంటే మరో వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించే వీలుందని పేర్కొన్నారు. ఇక బాలు చికిత్స పొందుతున్న అత్యవసర విభాగం దిగువ అంతస్థులో ప్రతి రోజూ వేద పండితులు వేదపారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బాలు చికిత్స పొందుతున్న గదిలో ఉన్న టీవీ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అంతే కాదు ఆయన వార్డు పరిధిలో నిత్యం తను పాడిన పాటలను వినిపిస్తున్నారు.
ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.