క‌రోనాపై యుద్ధం.. సాయం చేస్తానంటూ గ‌ళ‌మెత్తిన ఎస్పీ బాలు

కరోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే ప్ర‌య‌త్నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ‌ప్రాతిప‌దికన చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ప్ర‌భుత్వానికి సాయ‌మందించేందుకు సినీ సెల‌బ్రిటీలు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మాణ్యం కూడా ముందుకు వ‌చ్చారు. త‌నదైనా స్టైల్‌లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కరోనాపై ఓ పాట కంపోజ్‌ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వెన్నెల కంటి ర‌చించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. స‌ర్వేజ‌నా సుఖీనోభ‌వంతు…అంటూ […]

క‌రోనాపై యుద్ధం.. సాయం చేస్తానంటూ గ‌ళ‌మెత్తిన ఎస్పీ బాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 28, 2020 | 11:13 AM

కరోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే ప్ర‌య‌త్నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ‌ప్రాతిప‌దికన చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ప్ర‌భుత్వానికి సాయ‌మందించేందుకు సినీ సెల‌బ్రిటీలు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మాణ్యం కూడా ముందుకు వ‌చ్చారు. త‌నదైనా స్టైల్‌లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కరోనాపై ఓ పాట కంపోజ్‌ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వెన్నెల కంటి ర‌చించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. స‌ర్వేజ‌నా సుఖీనోభ‌వంతు…అంటూ తన పాట‌లోని చ‌ర‌ణాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు యస్పీబీ.

https://www.facebook.com/SPB/videos/262066364818532/