రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి…
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. సికింద్రాబాద్తో పాటు నాంపల్లి స్టేషన్లోనూ రైలు సేవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ రెండు స్టేషన్లనూ ప్రయాణికులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు థర్మల్ స్క్రీనింగ్ కౌంటర్లు ఏర్పాట్లు చేశాని వెల్లడించింది. రైల్వే స్టేషన్కు చాలా ముందుగానే ప్రయాణికులు వస్తున్నారని.. దానితో స్టేషన్ల వద్ద రద్దీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రయాణికులు సరైన సమయానికే రావాలని విజ్ఞప్తి చేసింది. రైల్వే ప్రయాణానికి 90 […]
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. సికింద్రాబాద్తో పాటు నాంపల్లి స్టేషన్లోనూ రైలు సేవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ రెండు స్టేషన్లనూ ప్రయాణికులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు థర్మల్ స్క్రీనింగ్ కౌంటర్లు ఏర్పాట్లు చేశాని వెల్లడించింది.
రైల్వే స్టేషన్కు చాలా ముందుగానే ప్రయాణికులు వస్తున్నారని.. దానితో స్టేషన్ల వద్ద రద్దీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రయాణికులు సరైన సమయానికే రావాలని విజ్ఞప్తి చేసింది. రైల్వే ప్రయాణానికి 90 నిమిషాల ముందే రైల్వేస్టేషన్కు రావాలని రైల్వే శాఖ సూచించింది. అయితే, అంతకంటే ముందే కొందరు స్టేషన్లకు పోటెత్తుతుండడంతో ప్రాంగణంలో రద్దీ నెలకొంటోందని.. దీనితో కొవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించినట్లుగా మారుతుందని ప్రకటించింది.