‘ఆర్ఆర్ఆర్’లో హైబ్రిడ్ పిల్ల..?
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ ఎంపికైయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ఎంపిక అయిందని ఆ మధ్య వార్తలు రాగా.. లేదు విదేశీ భామనే ఎంపిక చేస్తారని […]
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ ఎంపికైయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ఎంపిక అయిందని ఆ మధ్య వార్తలు రాగా.. లేదు విదేశీ భామనే ఎంపిక చేస్తారని టాక్ వచ్చింది.
కానీ తాజా సమాచారం ప్రకారం మలయాళ కుట్టి సాయి పల్లవి.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించనుందని సమాచారం. ఇటీవలే ఆర్ఆర్ఆర్ టీం సాయి పల్లవిని సంప్రదించగా, ఆమె బల్క్ డేట్స్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు చరణ్, ఎన్టీఆర్ గాయాల బారిన పడడం వల్ల చిత్ర షూటింగ్కు కొన్ని రోజులు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.