మళ్ళీ బ్యాట్ పట్టుకున్న సౌర‌వ్ గంగూలీ.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో జరిగిన మ్యాచ్..

బీసీసీ అధ్యక్షుడు , మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి బ్యాట్ పట్టుకున్నాడు. బోర్డు కార్య‌ద‌ర్శి జే షా టీమ్‌తో..

మళ్ళీ బ్యాట్ పట్టుకున్న సౌర‌వ్ గంగూలీ.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో జరిగిన మ్యాచ్..
Follow us

|

Updated on: Dec 23, 2020 | 10:07 PM

బీసీసీ అధ్యక్షుడు , మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి బ్యాట్ పట్టుకున్నాడు. బోర్డు కార్య‌ద‌ర్శి జే షా టీమ్‌తో గంగూలీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ నెల 25న‌ బీసీసీఐ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం సంద‌ర్భంగా ఈ మ్యాచ్  జరిగింది. అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ రాజీవ్ శుక్లా రిఫ‌రీగా వ్యవహరించారు. టెన్నిస్ బాల్ తో ఈ మ్యాచ్ జరిగింది. క్రిస్మ‌స్ రోజు జ‌రగ‌నున్న వార్షిక స‌మావేశంలో బీసీసీఐ కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది. కొత్త‌గా నిర్మించిన  మొతెరా ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య ఈ స్టేడియంలో తొలి అంత‌ర్జాతీయ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.