తెలంగాణ గవర్నర్గా డా. సౌందరరాజన్
తెలంగాణ గవర్నర్గా సౌందర రాజన్ నియమితులయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న సౌందర రాజన్ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. సౌందర్ రాజన్ వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్లో జన్మించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె ఉన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు కూడా కేంద్రం నూతన గవర్నర్లను నియమించింది. కేంద్ర […]
తెలంగాణ గవర్నర్గా సౌందర రాజన్ నియమితులయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న సౌందర రాజన్ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. సౌందర్ రాజన్ వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్లో జన్మించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె ఉన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు.
తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు కూడా కేంద్రం నూతన గవర్నర్లను నియమించింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా నియమించారు. ఇక హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా వ్యవహరిస్తున్న కల్రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్గా బాధ్యతలు అప్పగించారు. ఇక మహారాష్ట్రకు భగత్ సింగ్ కోశ్యారిని నియమించారు.కేరళ రాష్ట్రానికి ఆరిఫ్ అహ్మద్ ఖాన్ను గవర్నర్గా నియమించారు.