విదేశాలకు సోనియా, రాహుల్ !

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ హెల్త్ టెస్టుల నిమిత్తం శనివారం సాయంత్రం విదేశాలకు బయలుదేరినట్టు తెలుస్తోంది.

విదేశాలకు సోనియా, రాహుల్ !
Follow us

|

Updated on: Sep 12, 2020 | 10:27 PM

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ హెల్త్ టెస్టుల నిమిత్తం శనివారం సాయంత్రం విదేశాలకు బయలుదేరినట్టు తెలుస్తోంది. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సోనియాగాంధీ గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. సోనియా వెంట రాహుల్‌ గాంధీ కూడా ఫారెన్ వెళ్లారు. కానీ రాహుల్‌ వచ్చే వీకెండ్ తిరిగి ఇండియాకు వచ్చేస్తారని తెలుస్తోంది. రాహుల్‌ తిరిగి వచ్చిన అనంతరం పార్లమెంటు సమావేశాల్లో పాల్గొననున్నారు. సోనియా మాత్రం ఫస్ట్ ఫేజ్ సమావేశాలకు పూర్తిగా గైర్హాజరవుతారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్‌ చీఫ్ సోనియాగాంధీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జులై 30న ఆమె ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు. నార్మల్ టెస్టులు చేయించుకుని కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

దిగంబర దొంగ ఆట కట్టించిన పోలీసులు