Sonia tactics సలహాలిస్తూనే మెలిక పెట్టిన సోనియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. కరోనా పాండమిక్ పరిస్థితిని ఎదుర్కోవడంతో ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తూనే ఆయన్ని ఇరుకున పెట్టే సలహాలతో లేఖ రాశారు సోనియా గాంధీ.
Sonia political gymmicks on Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. కరోనా పాండమిక్ పరిస్థితిని ఎదుర్కోవడంతో ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తూనే ఆయన్ని ఇరుకున పెట్టే సలహాలతో లేఖ రాశారు సోనియా గాంధీ.
మంగళవారం సోనియాగాంధీ ప్రధానమంత్రికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు సూచనలిస్తున్నట్లుగానే లేఖలో పలు కీలకాంశాలను ప్రస్తావించారు. ఎంపీల వేతనాల్లో 30 కోత విధిస్తూ మోదీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు పలువురు, యుపీఏ భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకిస్తుంటే సోనియా మాత్రం స్వాగతించారు. వేతనాల్లో కోతను సమర్థించారు.
అదే సమయంలో సాధ్యం కాని సూచనలు చేసి మోదీని ఇరుకున్న పెట్టే రాజకీయ చతురతను ప్రదర్శించారు సోనియాగాంధీ. టీవీ, ప్రింట్, ఆన్లైన్ మాధ్యమాల్లో రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయాలని సోనియా ప్రభుత్వానికి సూచించారు. ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రకటనలు మాత్రమే ఇవ్వాలన్నారామె. 20 వేల కోట్ల రూపాయలతో తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిలిపివేయాలని సలహా ఇచ్చారు సోనియా.
బడ్జెట్లో 30 శాతం ఖర్చు తగ్గించి, తద్వారా వచ్చే రెండున్నర లక్షల కోట్ల రూపాయలను రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులు వంటి నిరుపేద వర్గాల కోసం కేటాయించాలని సోనియా గాంధీ తన లేఖలో సూచించారు. ప్రధాని సహా మంత్రులు, అధికారుల విదేశీ యాత్రలు నిలిపివేయాలని సలహా ఇచ్చారామె.
కరోనా సిచ్యుయేషన్నిన ఎదుర్కొనేందుకు మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్ ఫండ్కు వచ్చిన నిధులన్నీ.. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్కి బదిలీ చేయాలని సోనియా సజెస్ట్ చేశారు. మోదీ మార్కు రాజకీయంలో ఈ అంశాలు చాలా కీలకమని తెలిసిన సోనియా గాంధీ.. వాటినెలాగో మోదీ పక్కనపెట్టలేరన్న ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా ఆమె ఈ సలహాలను మోదీ ముందుంచారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.