భారత సైనికుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ?

తన కుటుంబంతో కలిసి ఈద్ జరుపుకునేందుకు జమ్మూ కాశ్మీర్ కి వెళ్లిన షకీర్ మంజూర్ అనే సైనికుడి జాడ కనబడడంలేదు. అతడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి ఉండవచ్చునని..

భారత సైనికుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2020 | 7:12 PM

తన కుటుంబంతో కలిసి ఈద్ జరుపుకునేందుకు జమ్మూ కాశ్మీర్ కి వెళ్లిన షకీర్ మంజూర్ అనే సైనికుడి జాడ కనబడడంలేదు. అతడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి ఉండవచ్చునని  భావిస్తున్నట్టు  సైనిక వర్గాలు తెలిపాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి షకీర్ కనబడకుండా పోయాడని, షోపియన్ కు వెళ్లిన ఇతని కారు…. కుల్గాం జిల్లా సరిహద్దుల్లో సగం కాలిన స్థితిలో కనిపించిందని ఈ  వర్గాలు పేర్కొన్నాయి. 162 బెటాలియన్ కి చెందిన షకీర్ కోసం జవాన్లు గాలింపు చేపట్టారు. డ్యూటీలో లేని సైనికులు జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు వచ్చినా వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేస్తుంటారని తెలుస్తోంది. కాగా-షకీర్  కిడ్నాప్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.