కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న పాముకాటు కేసులు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా పాముకాటు కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దివిసీమ‌లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న పాముకాటు కేసులు
Follow us

|

Updated on: Sep 02, 2020 | 11:38 AM

కృష్ణా జిల్లా వ్యాప్తంగా పాముకాటు కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దివిసీమ‌లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2015 నుంచి ప్రతి ఏడాది గణనీయంగా పాముకాటు కేసులు పెరుగుతున్నాయి.

2015 లో  జిల్లా వ్యాప్తంగా 2006 కేసులు నమోదు కాగా దివిసీమలో 681 నమోదు.. 2016 లో  2051 కేసులు  నమోదు కాగా  దివిసీమలో 704 కేసులు  నమోదు.. 2017 లో 2372 కేసులు  నమోదు కాగా  దివిసీమలో 726 కేసులు  నమోదు.. 2018 లో 3050 కేసులు నమోదు కాగా  దివిసీమలో  750 కేసులు నమోదు.. 2019 లో 3836 కేసులు  నమోదు కాగా  దివిసీమలో  801 కేసులు  నమోదు 2020లో గడిచిన 33 వారాలలో 1467 కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదు కాగా, దివిసీమలో  350 కేసులు నమోదు ..

పెరుగుతున్న పాము కాటులపై  జిల్లా అధికారులు ఫోక‌స్ పెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల‌లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో  పాముకాట్ల‌కు విరుగుడు మందు ఉండేలా ఏర్పాట్లు  చేసి మరణాలను నియంత్రిస్తున్నారు అధికారులు.

Also Read :

కళింగపట్నంలో ఆక‌ట్టుకుంటున్న‌ పవన్ సైకత శిల్పం

మద్యం వ్యవహారం : ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్