అశ్లీల చిత్రాలు చూపించి 11 ఏళ్ల బాలికపై లైంగికదాడి

తమిళనాడుతో దారుణం జరిగింది. ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు విద్యార్థులు. ముగ్గురు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కావడం విశేషం. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు.

అశ్లీల చిత్రాలు చూపించి 11 ఏళ్ల బాలికపై లైంగికదాడి
Follow us

|

Updated on: Jun 22, 2020 | 2:49 PM

తమిళనాడుతో దారుణం జరిగింది. ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు విద్యార్థులు. ముగ్గురు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కావడం విశేషం. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు.

కోయంబత్తూర్ జిల్లా సుందరాపురంకు చెందిన 11 ఏళ్ల బాలిక తల్లి చనిపోవడంతో తండ్రి వద్ద ఉంటోంది. తండ్రి కూలీపనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉండే బాలిక.. కింది పోర్షన్ లోని ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్తుండేది. ఇదే క్రమంలో గత మే నెల 20వ తేదిన టీవీ చూసేందుకు వచ్చిన బాలికకు ఆ ఇంట్లో ఉండే విద్యార్థితో పాటు అతని స్నేహితులు బాలికకు అశ్లీల చిత్రాలు చూపించి లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం తమ స్నేహితుడైన మరో ప్లస్ వన్ విద్యార్థిని పిలిపించి ముగ్గురు మరోసారి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఇలా బాలికను బ్లాక్ మెయిల్ చేసి మరోసారి ముగ్గురూ అత్యాచారం చేశారు. గత శనివారం బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక లైంగిక దాడికి గురైనట్లు వైద్యలు నిర్ధారించారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కోవై నార్త్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే, బాలిక ఉండే ఇంటికి కింది భాగంలో నివాసం ఉండే ఇంట్లో10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉన్నాడు. ఆన్‌లైన్ తరగతుల కోసం అతనికి తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో ఆ విద్యార్థి తన తోటి విద్యార్థితో పాటు మరో స్నేహితుడైన ప్లస్ వన్ విద్యార్థిని ఇంటికి పిలిపించుకొని ఇద్దరూ సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు వీక్షించేవారు. ఈ నేపథ్యంలో బాలికను లొంగదీసుకోవాలని ఫ్లాన్ చేసి ఆమెకు అశ్లీల చిత్రాలు చూపించి ముగ్గురు విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు.