రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటిన రాజంపేట మాజీ ఎమ్మెల్యే

కడప జిల్లా రాజంపేట మండలం రోళ్ల మడుగు రహదారి మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళుతోన్న

రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటిన రాజంపేట మాజీ ఎమ్మెల్యే
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2020 | 12:37 PM

Kadapa Road Accident: కడప జిల్లా రాజంపేట మండలం రోళ్ల మడుగు రహదారి మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళుతోన్న మినీ టిప్పర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా.. నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. అదే సమయంలో అటు వైపు వెళ్తోన్న రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి తన కారును ఆపారు. అప్పటికే స్థానికులు అంబులెన్స్‌కి ఫోన్ చేయగా.. తన వాహనంలోనూ గాయపడ్డ వారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  విషమంగా ఉన్న వారిని అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కి తరలించారు. కాగా గాయపడ్డ వారు పెనగలూరు మండలం సింగనమల గ్రామానికి చెందిన వారని సమాచారం.

Read More:

అతడిపై పరువునష్టం దావాకు సిద్ధమైన కొరటాల..!

సురేందర్ రెడ్డి మూవీ.. అఖిల్ పాత్రపై ఆసక్తికర వార్త!