బంద్ సజావుగా సాగేనా? ప్రభుత్వం ఏం చేయబోతుంది?

తెలంగాణలో  ఆర్టీసీ సమ్మెకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడంతో శనివారం జరగబోయే రాష్ట్రవ్యాప్త బంద్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ప్రభుత్వంపై మరో తెలంగాణ ఉద్యమంలా ఆందోళన చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చిరించారు. తాజా పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన విచారణలో హైకోర్టు ప్రభుత్వంపై అక్షింతలు […]

బంద్ సజావుగా సాగేనా?  ప్రభుత్వం ఏం చేయబోతుంది?
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 6:56 PM

తెలంగాణలో  ఆర్టీసీ సమ్మెకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడంతో శనివారం జరగబోయే రాష్ట్రవ్యాప్త బంద్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ప్రభుత్వంపై మరో తెలంగాణ ఉద్యమంలా ఆందోళన చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చిరించారు. తాజా పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

శుక్రవారం జరిగిన విచారణలో హైకోర్టు ప్రభుత్వంపై అక్షింతలు వేయడం ఆర్టీసీకార్మికుల విజయంగా భావిస్తున్నారు. పోరాడి సాధించిన రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం కూడా ఇందుకు నిదర్శంనంగా నిలిచింది. అయితే తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోకండా చర్చలు జరపలేదని వాదిస్తున్న ఆర్టీసీ జేఏసీ.. శనివారం జరిగే బంద్ యధావిధిగా జరుగుతుందని ప్రకటించింది.

ఇదిలా ఉంటే రేపు జరగనున్న తెలంగాణ బంద్‌కంటే మందుగానే శుక్రవారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఒకవైపు కోర్టులో వాదనలు జరుగుతుండగానే ఆయనను అరెస్టు చేయడం సరికాదని భావించారో ఏమో గాని విడిచిపెట్టారు. ఒకవేళ అరెస్టు చేస్తే మాత్రం ఇది తీవ్రస్ధాయిలో ఉంటుందని కూడా ప్రభుత్వం భావించి ఉండొచ్చు. ఇప్పటికే సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే శనివారం జరగబోయే బంద్ ఏ విధంగా ఉంటుందోఅనేది ఎవ్వరూ ఊహించనట్టుగా ఉంది. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కార్మికులకు ప్రజలు అండగా నిలిస్తే వారిని అడ్డుకునేవారు ఎవరూ ఉండబోరంటూ కూడా న్యాయస్ధానం పేర్కొంది. ఇక ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు కూడా గమనిస్తుండటంతో .. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..