పక్కా మళ్లొస్తా.. తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ ప్రామిస్
‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి చిత్రాలతో లవర్బాయ్గా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు సిద్దార్థ్. అయితే ఆ తరువాత తమిళ్లో బిజీగా ఉండటం వలన ఈ హీరో తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఆ మధ్యలో రెండు, మూడు డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించినప్పటికీ.. ఆరు సంవత్సరాలుగా స్ట్రైట్ తెలుగు చిత్రాన్ని మాత్రం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులనుద్దేశించి తాజాగా సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ‘‘ఎవడు ఏమన్నా నేను […]
‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి చిత్రాలతో లవర్బాయ్గా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు సిద్దార్థ్. అయితే ఆ తరువాత తమిళ్లో బిజీగా ఉండటం వలన ఈ హీరో తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఆ మధ్యలో రెండు, మూడు డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించినప్పటికీ.. ఆరు సంవత్సరాలుగా స్ట్రైట్ తెలుగు చిత్రాన్ని మాత్రం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులనుద్దేశించి తాజాగా సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.
‘‘ఎవడు ఏమన్నా నేను తిరిగి వస్తానులే. ఈ ప్రామిస్ను గుర్తుపెట్టుకోండి. తెలుగు ప్రేక్షకులు మళ్లీ నన్ను ఆదరించేలా ప్రయత్నిస్తా. మరో 18నెలల సమయం ఇవ్వడం ప్రేక్షకుల్లారా.. మిమ్మల్ని నేను ఎప్పుడూ నిరుత్సాహపరచను. మంచి కంటెంట్ ఉన్న కథ సిద్ధమౌతోంది. మాట్లాడుకుందాం’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై తెలుగు ఆడియెన్స్ స్పందిస్తూ.. ‘‘నువ్వొస్తానంటే మేమొద్దంటామా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Evadu emanna nenu thirugi osthanu le. Please note this promise down…i will at the very least try my best to please my #Telugu audience once again. Give me 18 months prayakshakulaara. I will not let you down. Lot of hard work and great content on the way. Maatladkundhaam ❤️
— Siddharth (@Actor_Siddharth) May 1, 2019