Breaking: బాబుకు మరో షాక్‌.. రేపు వైసీపీలోకి శిద్ధా రాఘవరావు..!

ఏపీలో చంద్రబాబుకు మరో గట్టి షాక్ తగలనుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు బుధవారం వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు.

Breaking: బాబుకు మరో షాక్‌.. రేపు వైసీపీలోకి శిద్ధా రాఘవరావు..!
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 2:54 PM

ఏపీలో చంద్రబాబుకు మరో గట్టి షాక్ తగలనుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు బుధవారం వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. రేపు సాయత్రం కుమారుడితో కలిసి సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మార్గం సుగమం చేసినట్లు సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలోనే శిద్ధా వైసీపీలో చేరాలనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో సాధ్యపడకపోవడంతో ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు మాజీ మంత్రి.

కాగా 1999లో టీడీపీలో చేరిన శిద్ధా వివిధ హోదాల్లో పనిచేశారు. 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. 2007లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి గెలుపొందిన ఆయన.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 21 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగిన శిద్ధా ఇప్పుడు పార్టీ మారడం.. ఆ పార్టీకి పెద్ద షాక్ లాంటిదే. ఇదిలా ఉంటే వైసీపీలో చేరేందుకు టీడీపీ నాయకులు చాలా మంది సిద్దంగా ఉన్నారని తాజాగా కరణం బలరామ్ సైతం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

Read This Story Also: విజయవాడ ‘గ్యాంగ్‌వార్’: పండు డిశ్చార్జిపై హైడ్రామా..!