Saaho: ప్రభాస్ మూవీ కోసం.. రూ.7 కోట్ల పారితోషికం: బిగ్ బొనాంజా టు శ్రద్ధా
బాహుబలి తర్వాత రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం సాహో. సాహో మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో శ్రద్ధా కపూర్ తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. అయితే శ్రద్ధాకపూర్కు బాలీవుడ్లో మంచి పేరుంది. అయినప్పటికీ రెమ్యునరేషన్ ఎప్పుడూ రూ. 3 కోట్లు కూడా దాటలేదు. కాగా, సాహోలో తనను నటించమని ప్రపోజల్ పెట్టినప్పుడే రూ. 7 కోట్లు డిమాండ్ చేసిందట. దానికి తోడు ఈ […]
బాహుబలి తర్వాత రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం సాహో. సాహో మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో శ్రద్ధా కపూర్ తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. అయితే శ్రద్ధాకపూర్కు బాలీవుడ్లో మంచి పేరుంది. అయినప్పటికీ రెమ్యునరేషన్ ఎప్పుడూ రూ. 3 కోట్లు కూడా దాటలేదు. కాగా, సాహోలో తనను నటించమని ప్రపోజల్ పెట్టినప్పుడే రూ. 7 కోట్లు డిమాండ్ చేసిందట. దానికి తోడు ఈ సినిమా చేసినంత కాలం బాలీవుడ్ సినిమాలు చేయనని కూడా హామీ ఇచ్చిందని సమాచారం. అందుకే ఏడు కోట్లు ఇచ్చేందుకు సాహో నిర్మాతలు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆమె తమ సినిమాలో నటించడం ప్లస్ పాయింట్ అవుతుందని అందుకే అంత మొత్తం చెల్లించామని నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి సాహో మంచి విజయం సాధిస్తే.. శ్రద్ధ తన రెమ్యునరేషన్ ఇంకా పెంచే అవకాశం ఉందని సినీ ప్రేక్షకులు అంటున్నారు.