రైలులో షార్ట్ సర్క్యూట్.. పలువురికి అస్వస్థత

గుంటూరు జిల్లా వేజెళ్ల రైల్వేస్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తోన్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తి.. ఓ బోగిలోకి విద్యుత్ ప్రవహించింది. దీంతో ఆ బోగిలో ఉన్న పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి లోనయ్యారు. కొంతమంది రైలు బోగి నుంచి బయటకు దూకేయడంతో.. గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ తరువాత మరో బోగిని జతచేసి రైలు ప్రయాణాన్ని కొనసాగించారు.

రైలులో షార్ట్ సర్క్యూట్.. పలువురికి అస్వస్థత
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 2:26 PM

గుంటూరు జిల్లా వేజెళ్ల రైల్వేస్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తోన్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తి.. ఓ బోగిలోకి విద్యుత్ ప్రవహించింది. దీంతో ఆ బోగిలో ఉన్న పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి లోనయ్యారు. కొంతమంది రైలు బోగి నుంచి బయటకు దూకేయడంతో.. గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ తరువాత మరో బోగిని జతచేసి రైలు ప్రయాణాన్ని కొనసాగించారు.