దారుణం.. ఇంటి అద్దె కట్టలేదని కాల్పులు చేసిన యజమాని

ఇంటి అద్దె కట్టలేదని కాల్పులు చేశాడు ఓ ఇంటి యజమాని. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఆగ్రహానికి గురైన ఓ యజమాని కిరాతకంగా ప్రవర్తించాడు. గత కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయింది. అన్ని కంపెనీలు..

దారుణం.. ఇంటి అద్దె కట్టలేదని కాల్పులు చేసిన యజమాని
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2020 | 4:31 PM

ఇంటి అద్దె కట్టలేదని కాల్పులు చేశాడు ఓ ఇంటి యజమాని. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఆగ్రహానికి గురైన ఓ యజమాని కిరాతకంగా ప్రవర్తించాడు. గత కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయింది. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. జనాలు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా.. మరికొందరికి ఉపాధులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పేదవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు రోజూ పనికి వెళ్తేనే ఇళ్లు గడుస్తుంది. అప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటి యజమానులకు పలు సూచనలు చేశారు. ఇంటిలో అద్దెకు ఉంటున్న వారిని ఓనర్లు రెంట్ కోసం వేధించవద్దంటూ చెప్పాయి. వారి వద్ద ఉన్నప్పుడే డబ్బులు తీసుకోవాలని పేర్కొన్నాయి.

అయినా కూడా కొందరు ఇంటి యజమానులు అద్దెకు ఉంటున్న వారిని వేధిస్తూనే ఉన్నారు. మరికొందరైతే ఇంటి కిరాయి ఇవ్వడం లేదని హతమార్చిన ఘనటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో జరిగింది. బెల్గాం జిల్లాలోని చిక్కోడి ప్రాంతంలో గాల్లో కాల్పులు జరిపాడు ఇంటి యజమాని. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అనంతరం ఈ సమాచారం పోలీసులకు చేరడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Read More: 

కాణిపాక ఆలయంలో కరోనా కలకలం.. హోమ్ గార్డ్‌కి పాజిటివ్..

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి