షిరిడీ సాయినాథా ! లాక్ డౌన్ వల్ల ఇంత నష్టమా ?
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షిరిడిలోని సాయిబాబా ఆలయానికి రోజుకు రూ. 1.5 కోట్లకు పైగా నష్టం వఛ్చినట్టు బాబా మందిర్ ట్రస్ట్ తెలిపింది. మార్చి 17 న ఈ ఆలయం మూసివేసి తిరిగి మే 3 న తెరిచారు. ఈ మధ్య కాలంలో ట్రస్టుకు ఆన్ లైన్ ద్వారా రూ. 2.53 కోట్లు మాత్రమే అందినట్టు తెలిసింది. అలాగే రోజుకు కొన్ని వేల రూపాయల విరాళం అందుతూ వచ్చిందని, ఇది మొత్తం సుమారు ఆరు […]
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షిరిడిలోని సాయిబాబా ఆలయానికి రోజుకు రూ. 1.5 కోట్లకు పైగా నష్టం వఛ్చినట్టు బాబా మందిర్ ట్రస్ట్ తెలిపింది. మార్చి 17 న ఈ ఆలయం మూసివేసి తిరిగి మే 3 న తెరిచారు. ఈ మధ్య కాలంలో ట్రస్టుకు ఆన్ లైన్ ద్వారా రూ. 2.53 కోట్లు మాత్రమే అందినట్టు తెలిసింది. అలాగే రోజుకు కొన్ని వేల రూపాయల విరాళం అందుతూ వచ్చిందని, ఇది మొత్తం సుమారు ఆరు లక్షల మేరకేనని ట్రస్ట్ వెల్లడించింది. సాధారణంగా సాయినాథుని ఆలయానికి ఏడాదికి రూ. 600 కోట్ల వరకు విరాళాలు నగదు రూపంలో గానీ, వివిధ కానుకల రూపంలో గానీ అందుతుంటాయి. ఇది రోజుకు 1.64 కోట్లకు పైగానే ఉంటుంది. ఒకవేళ లాక్ డౌన్ జూన్ వరకు పొడిగించిన పక్షంలో.. 150 కోట్లకు పైగా నష్టం వస్తుందని ట్రస్ట్ అంచనా వేసింది. దీనివల్ల తాము చేపట్టే విధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మార్చి 17 న ఆలయాన్ని మూసివేసినప్పటి నుంచి ఆన్ లైన్ ద్వారా రోజుకు పదిమందికి మించి భక్తులు బాబా దర్శనం చేసుకోలేదని వారు చెప్పారు. అయితే క్రమంగా విరాళాలు పెరగవచ్చునని ఆశిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.