అమ్మా నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నా..!
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాతో విడాకులు తీసుకోబోతోంది. ఈ విషయం శిల్పా ఫోన్ ద్వారా ఆమె తల్లికి మెసేజ్ చేరింది. దీంతో శిల్పా కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. అయితే కొద్ది సేపట్లోనే అది ఫ్రాంక్ అని తెలీడంతో ఆమె కుటుంబసభ్యులతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సూపర్ డ్యాన్స్ర్ 3 అనే షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ గీతా కపూర్, దర్శకుడు అనురాగ్ బసుతో కలిసి శిల్పా శెట్టి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. షోలో […]
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాతో విడాకులు తీసుకోబోతోంది. ఈ విషయం శిల్పా ఫోన్ ద్వారా ఆమె తల్లికి మెసేజ్ చేరింది. దీంతో శిల్పా కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. అయితే కొద్ది సేపట్లోనే అది ఫ్రాంక్ అని తెలీడంతో ఆమె కుటుంబసభ్యులతో ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సూపర్ డ్యాన్స్ర్ 3 అనే షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ గీతా కపూర్, దర్శకుడు అనురాగ్ బసుతో కలిసి శిల్పా శెట్టి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. షోలో ఉన్నప్పుడు శిల్పాకు తెలీయకుండా ఆమె ఫోన్ తీసుకున్న అనురాగ్ బసు రాజ్కుంద్రాతో తాను విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు ఓ మెసేజ్ను శిల్పా తల్లికి మెసేజ్ చేశారు. ఈ విషయాన్ని గీతా కపూర్, శిల్పాకు చెప్పడంతో వెంటనే ఫోన్ తీసుకున్న ఆమె తన తల్లికి ఫోన్ చేసింది. ‘‘ఏ టెన్షన్ పడొద్దు అమ్మా. ఇద్దరం సంతోషంగా ఉన్నాం. అనురాగ్ దాదా ఈ మెసేజ్ను పంపాడు. నేను గర్భవతి అని, విడాకులు తీసుకుంటున్నా అని వచ్చే మెసేజ్లను అస్సలు నమ్మొద్దు. ఏదైనా నేను నీకు చెబుతాను’’ అంటూ పేర్కొంది. దీంతో శిల్పా కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన శిల్పా రెడ్డి, 2009లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కుంద్రాను వివాహం చేసుకుంది. ఈ ఇద్దరికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఐపీఎల్ ఫిక్షింగ్ కేసులో రాజ్ కుంద్రా నిందితుడిగా ఉన్న సమయంలో శిల్పా అతడికి ఎంతో అండగా నిలిచిన విషయం తెలిసిందే.