ఇంగ్లండ్ లోనే ధావన్‌కు చికిత్స!

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భారత్‌కు శుభారంభం లభించింది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. బొటన వేలికి ఫ్రాక్చర్ కావడంతో అతన్ని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సూచించారు. అయితే ధావన్‌కు ఇంగ్లండ్‌లోనే చికిత్స అందించాలని బీసీసీఐ నిర్ణయించింది. ధావన్‌ జట్టుతో మెడికల్‌ టీం పర్యవేక్షణలో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. రాబోయే […]

ఇంగ్లండ్ లోనే ధావన్‌కు చికిత్స!
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2019 | 9:58 AM

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భారత్‌కు శుభారంభం లభించింది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. బొటన వేలికి ఫ్రాక్చర్ కావడంతో అతన్ని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సూచించారు. అయితే ధావన్‌కు ఇంగ్లండ్‌లోనే చికిత్స అందించాలని బీసీసీఐ నిర్ణయించింది. ధావన్‌ జట్టుతో మెడికల్‌ టీం పర్యవేక్షణలో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. రాబోయే మూడు మ్యాచ్ లకు ధావన్‌ దూరంగా ఉంటాడని బీసీసీఐ పేర్కొంది.