IPL 2020:CSK vs DC : గబ్బర్ సెంచరీ, ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం
ఐపీఎల్ 2020 సీజన్లో శనివారం రాత్రి మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి.
ఐపీఎల్ 2020 సీజన్లో శనివారం రాత్రి మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై ఢిల్లీకి 180 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. అయితే భారీ ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ (101*, 58 బంతుల్లో, 14×4, 1×6) సెంచరీతో అదరగొట్టడంతో…ఢిల్లీ మరో విజయాన్ని అందుకుంది. చెన్నైపై అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయిదు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసింది ఢిల్లీ. ఈ విజయంతో ఢిల్లీ టీమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. మరోవైపు చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు కఠినం అయ్యాయి.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 రన్స్ చేసింది. డుప్లెసిస్(58: 47 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీకకి తోడు షేన్ వాట్సన్(36: 28 బంతుల్లో 6ఫోర్లు) రాణించారు. ఆఖర్లో అంబటి రాయుడు(45 నాటౌట్: 25 బంతుల్లో 1ఫోర్, 4సిక్సర్లు ), రవీంద్ర జడేజా(33 నాటౌట్: 13 బంతుల్లో 4సిక్సర్లు ) అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా రబాడ, తుషార్ దేశ్పాండే చెరో వికెట్ దక్కించుకున్నారు.