మహబూబ్నగర్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కిడ్నాప్, హత్య…
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని మర్డర్ చేశారు కిడ్నాపర్లు. ఓ వివాదస్పద ల్యాండ్ విషయంలో జడ్చర్ల (బాదేపల్లి) మాజీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డిని( పెట్రోల్ బంక్ రామచంద్రారెడ్డి) ఇటీవల షాద్ నగర్లో కిడ్నాప్ చేశారు ఆగంతకులు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని మర్డర్ చేశారు కిడ్నాపర్లు. ఓ వివాదస్పద ల్యాండ్ విషయంలో జడ్చర్ల (బాదేపల్లి) మాజీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డిని( పెట్రోల్ బంక్ రామచంద్రారెడ్డి) ఇటీవల షాద్ నగర్లో కిడ్నాప్ చేశారు ఆగంతకులు. అనంతరం ఆయన్ను మర్డర్ చేశారు. కొత్తూరు మండలంలోని పెంజర్ల విలేజ్ దగ్గర్లో రామచంద్రారెడ్డిని దుండగులు చంపేసినట్లు సమాచారం.
శుక్రవారం షాద్ నగర్ సిటీలో రామచంద్రారెడ్డి తన కారులో కూర్చుని ఉండగా… స్థానికుడైన అన్నారం ప్రతాప్ రెడ్డి ఆయన్ను కారులోంచి దించి తన వెంట తీసుకువెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ ప్రతాప్ రెడ్డికి, రామచంద్రా రెడ్డికి మధ్య చాలాకాలంగా భూ వివాదం నడుస్తోంది. తాజాగా రామచంద్రారెడ్డిని హత్య చెయ్యడం స్థానికంగా కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అన్నారం విలేజ్ లో ఓ ల్యాండ్ వివాదంలో ఉంది. ఈ భూమి విషయంలో రెండు వర్గాల మధ్య చాలాకాలం నుంచి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ వివాదంపై కేసు కూడా నమోదు చేసినట్లు షాద్ నగర్ పోలీసులు తెలిపారు.