ఏపీలో కొవిడ్ సిరో సర్వైలెన్స్‌

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వాళ్లు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిరో సర్వైలెన్స్‌ నిర్వహించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14%, నెల్లూరు జిల్లాలో 9% మంది చొప్పున వైరస్‌ సోకిందని నిర్ధారణకు వచ్చారు. కానీ వీరెవరికీ వైరస్‌ సోకినట్లు, తగ్గిపోయినట్లు తెలియలేదని […]

ఏపీలో కొవిడ్ సిరో సర్వైలెన్స్‌
Follow us

|

Updated on: Sep 26, 2020 | 3:30 PM

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వాళ్లు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిరో సర్వైలెన్స్‌ నిర్వహించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14%, నెల్లూరు జిల్లాలో 9% మంది చొప్పున వైరస్‌ సోకిందని నిర్ధారణకు వచ్చారు. కానీ వీరెవరికీ వైరస్‌ సోకినట్లు, తగ్గిపోయినట్లు తెలియలేదని వెల్లడించారు. ఎందుకంటే వారికి ఎటువంటి అనుమానిత లక్షణాలు లేకపోవడమే కారణమని తేల్చారు.

వీరంతా తమ రోజువారీ పనుల నిమిత్తం బయట తిరుగుతున్నవారే. ఈ 4 జిల్లాల రిపోర్టుల్ని జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి విశ్లేషిస్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏపీ కోవిడ్ కంట్రోల్ బోర్డ్ పలు నివారణ చర్యలు చేపట్టిందని ఏపీ కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు.