తొలిసారి సారీ చెప్పిన కిమ్, అది కూడా శత్రు దేశానికి !
ఓ సంచలనమే జరిగింది. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి సారీ చెప్పారు. అది కూడా శత్రు దేశమైన దక్షిణ కొరియాకు.
ఓ సంచలనమే జరిగింది. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి సారీ చెప్పారు. అది కూడా శత్రు దేశమైన దక్షిణ కొరియాకు. తమ దేశ గవర్నమెంట్ ఆఫీసర్ హత్య అనుకోకుండా జరిగిందని కిమ్ వివరణ ఇచ్చినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష భవనం వెల్లడించింది.
ఏం జరిగిందంటే :
దక్షిణ కొరియాకు చెందిన ఒక ప్రభుత్వ అధికారిని ఉత్తర కొరియా కాల్చి చంపింది. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసింది. ఈ విషయాన్ని గురువారం దక్షిణ కొరియా తెలిపింది. అక్రమ చేపల వేట నిరోధక బృందంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ 48 ఏళ్ల అధికారి సోమవారం ఓడ నుంచి మిస్సయ్యాడని.. మరుసటి రోజు ఓ చిన్నబోటులో ఉత్తర కొరియా జలాల్లోకి ప్రవేశించాడని, దీన్ని గమనించిన ఉత్తర కొరియా రక్షణ దళాలు అతణ్ని కాల్చి చంపారని పేర్కొంది. పీపీఈ కిట్లు ధరించిన భద్రతా సిబ్బంది ఆ ఆఫీసర్ మృతదేహాన్ని దహనం చేశారని వెల్లడించింది. కరోనా వ్యాప్తి కట్టడి పేరుతో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది ఉత్తర కొరియా. తమ దేశంలోకి అక్రమంగా ఫారెనర్స్ ఎవరైనా ప్రవేశిస్తే కాల్చి చంపేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది.
Also Read :